Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీ, మండల పరిషత్‌లకు పాలకవర్గాలు కరవు

Follow Udayam Digital on Google
హరిక శర్మ Aug 07, 2026 10:40 AM ఖమ్మంతెలంగాణ
జడ్పీ, మండల పరిషత్‌లకు పాలకవర్గాలు కరవు - Udayam Digital
ఖమ్మం జిల్లా పరిషత్తు, 20 మండల పరిషత్‌లకు రెండేళ్లుగా పాలకవర్గాలు లేక ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఎన్నికలు జరగకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో జడ్పీ, మండల పరిషత్‌లకు రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. పాలకవర్గాలు లేక ప్రజా సమస్యలపై సమీక్షలు, నిర్ణయాల ప్రక్రియ ప్రభావితమవుతోందని స్థానికంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...