వార్తలకు తిరిగి వెళ్లండి

పాండురంగ స్వామి దేవాలయంలో శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ విఠలేశ్వర స్వామికి శ్రీకృష్ణాష్టమి సందర్భంగా పంచామృతాభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో అర్చకులు అభిషేకాలు చేశారు.
అనంతరం శుద్ధ జలాలతో శుద్ధి చేసి, వివిధ పూలతో స్వామి, అమ్మవార్లను అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

