వార్తలకు తిరిగి వెళ్లండి

గంపలగూడెం మండలం పెనుగొలను గ్రంథాలయంలో ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సాహిత్య సేవలకు నివాళులర్పించారు.
గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ, పద్మరాజు రచించిన "గాలి వాన" కథకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, ఆయన 8 నవలలు, 60 కథలతో పాటు అనేక నాటికలు, చలనచిత్ర పాటలను తెలుగు సాహిత్యానికి అందించారని కొనియాడారు.
Comments
Loading comments...

