వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు సంబంధించిన తేదీలను ఆలయ అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 1న గురువారం మండల దీక్ష ప్రారంభమై, అనంతరం చదురు గుడి, వనం గుడి వద్ద పందిరి రాట మహోత్సవం నిర్వహించనున్నారు.
అక్టోబర్ 22న అర్ధమండల దీక్ష, 26న తొలేళ్ల మహోత్సవం, 27న సిరిమాను ఉత్సవం జరగనున్నాయి. నవంబర్ 3న తెప్పోత్సవం, 7న కలశ జ్యోతి ఊరేగింపు, 10న ఉయ్యాలకంబాల మహోత్సవం, 11న చండీ హోమం నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

