Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం సమీపంలో ఏనుగుల గుంపు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 12:07 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురం సమీపంలో ఏనుగుల గుంపు - Udayam
పార్వతీపురం మండలం రంగాలగూడ గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. మంగళవారం అటవీ శాఖ సిబ్బంది ఈ విషయాన్ని తెలిపారు. గ్రామస్థులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఖరీఫ్ సాగు సమయం కావడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఏనుగుల గుంపును వెంటనే తరలించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...