వార్తలకు తిరిగి వెళ్లండి

లావేరు మండలంలోని రాయిలింగారిపేటకు చెందిన గొర్లె భవాని (45) గత నెల 31న వ్యవసాయ పనులకు పొలానికి వెళ్లగా పాము కాటేసింది.వెంటనే ఆమెను రణస్థలం సీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు.
అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలికి భర్త భానోజిరావు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు లావేరు ఎస్సై వి. సందీప్కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

