వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం జనగాం శివారులోని ఓ ఫామ్హౌస్లో పనిచేస్తున్న మహిళ పాముకాటుతో మృతి చెందింది. ఈ నెల 23న అర్ధరాత్రి 2 గంటలకు నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని పాము కాటువేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది.
చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

