వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని కొత్తకాలనీలో పాము కాటుకు గురై తోటకూర సోమయ్యకు చెందిన పాడి గేదె మృతి చెందింది. ఉదయం బావి వద్దకు వెళ్లి చూడగా గేదె మృతి చెంది కనిపించింది. దీంతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
పాడి గేదెపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబానికి ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు. అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

