Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడుబడిన బావిలో యువకుడి మృతదేహం

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 10:12 AM మహబూబ్‌నగర్General
పాడుబడిన బావిలో యువకుడి మృతదేహం - Udayam
జడ్చర్ల రైల్వే ట్రాక్ సమీపంలోని పాడుబడిన బావిలో యువకుడు రమేష్ మృతదేహం లభ్యమైంది. ఇంద్రానగర్ కాలనీకి చెందిన రమేష్ మూడు రోజుల క్రితం చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయినట్లు సమాచారం. మూడు రోజుల తర్వాత బుధవారం ఉదయం మృతదేహం నీటిపైకి తేలడంతో అటుగా వెళ్తున్న యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...