వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యాశాఖ మంత్రి రాజీనామాకు ప్రతిపక్షాల పట్టు

నీట్ పేపర్ లీక్ ఉదంతానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని లోక్సభలో ప్రతిపక్షాలు భీష్మించుకూర్చున్నాయి. ఎంపీల నిరసనల మధ్య సభ రేపటికి వాయిదా పడింది.
ప్రభుత్వం చర్చ నుంచి పారిపోతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించగా, ప్రతిపక్షాలే చర్చను అడ్డుకుంటున్నాయని మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు.
Comments
Loading comments...