వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్లింల పండుగ బక్రీద్ వేళ ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. యూపీలో రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయడం మరియు జంతు బలులు ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధించారు. ఒకవేళ ప్రార్థనలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే, మసీదుల్లో షిఫ్టుల వారీగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిషేధిత జంతువులను వధించరాదని, బలుల అనంతరం ఆయా ప్రదేశాలను పూర్తి పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

