వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఓటర్ల జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఫిర్యాదు చేస్తే సరిచేస్తామని ఎంపీడీవో పి.రవికుమార్ చెప్పారు. బొబ్బిలి మండలం గొర్లిసీతారాంపురంలో గురువారం గ్రామసభనిర్వహించారు.
స్థానిక ఎన్నికల కోసం కులాల వారీగా ఓటర్ల జాబితా తయారు చేశామని, కులం తప్పుగా నమోదు అయితే ఫిర్యాదు చేయాలన్నారు. ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా చెప్పాలన్నారు. కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

