వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) విధానానికి వ్యతిరేకంగా, పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దండేపల్లి మండలంలోని జెడ్పి పాఠశాల ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు.
సిపిఎస్ విధానంతో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.
Comments
Loading comments...

