వార్తలకు తిరిగి వెళ్లండి
రిటైర్మెంట్ ముందే అనిశా వలలో పడ్డ అధికారి

వారం రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్న అనంతపురం జిల్లా దేవాదాయశాఖ ఏసీ గంజి మల్లికార్జున ప్రసాద్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. చెక్కు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు అనిశాను ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కార్యాలయంలోనే దాడులు చేసి నిందితుడిని పట్టుకున్నారు. రిటైర్మెంట్కు సమీపంలో అధికారి అవినీతికి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది.
Comments
Loading comments...