Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయమూర్తి విచక్షణను ఏఐ భర్తీ చేయలేదు

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 6:30 AM హైదరాబాద్General
న్యాయమూర్తి విచక్షణను ఏఐ భర్తీ చేయలేదు - Udayam
కృత్రిమ మేధ వేగంగా దూసుకుపోతున్నప్పటికీ న్యాయమూర్తి విచక్షణను, మానవీయ ఆలోచనా విధానాన్ని అది భర్తీ చేయలేదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద స్పష్టం చేశారు. మాదాపూర్‌లో నిర్వహించిన లీగల్ ఎరా కాన్‌క్లేవ్‌లో ఆమె మాట్లాడారు. కోర్టుల బాధ్యతల్లో టెక్నాలజీ సహకరిస్తుందని, అయితే న్యాయ నిర్ణయాలకు ఏఐ కేవలం సహాయకారిగా మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...