వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఫోటోగ్రాఫర్లు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బొమ్మెర లక్ష్మీపతి జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.
అనంతరం ఫోటోగ్రాఫర్లందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దూసముడి సవిన్, వెంకట్, నరేష్, కౌశిక్, అశోక్, రాము, ముత్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

