వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీనగర్ మండలవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో జనజీవనం స్తంభించింది. అత్యవసర పనులు మినహా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
రోడ్లపై రాకపోకలు తగ్గిపోయాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

