వార్తలకు తిరిగి వెళ్లండి

కొండమల్లేపల్లిలో రూపారెడ్డి హత్య కేసులో ఆరు రోజులు గడిచినా నిందితుల ఆచూకీ లభించలేదు. దర్యాప్తులో భాగంగా మూడు పోలీసు బృందాలు రంగంలోకి దిగి 100 మందికిపైగా అనుమానితులను విచారించినట్లు సమాచారం.
నిందితులు ఎలాంటి ఆనవాళ్లు వదలకుండా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నిందితుల ఆచూకీ లభించకపోవడంతో కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

