వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుమలలో 'నో హార్న్' నిబంధన

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు తితిదే నోహార్న్, సైరన్ జోన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఘాట్ రోడ్లు, జీఎన్సీ టోల్గేట్ సహా తిరుమల వ్యాప్తంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
రెండు వేలకు పైగా సీసీ కెమెరాల ద్వారా పోలీస్ కమాండ్ కంట్రోల్ విభాగం నిరంతరం పర్యవేక్షిస్తోంది. డెసిబుల్స్ పరిమితి దాటి శబ్దం చేసే వాహనాలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు.
Comments
Loading comments...