వార్తలకు తిరిగి వెళ్లండి
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు హైకోర్టు బ్రేక్

శంషాబాద్ బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు కేటాయించిన భూములపై తెలంగాణ హైకోర్టు కీలక విచారణ జరిపింది. వివాదాస్పదంగా మారిన ఆ 28 ఎకరాల భూమిలో ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
తమ భూమిని కాపాడుకునేందుకు నలుగురు రైతులు దాఖలు చేసిన లంచ్మోషన్ పిటిషన్ను విచారించిన జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Loading comments...