వార్తలకు తిరిగి వెళ్లండి

జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో నలందా మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం యువ నాయకత్వ దినోత్సవం నిర్వహించారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి, మహిపాల్, తేజస్వీలు విద్యార్థినులకు నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇచ్చారు.
అనంతరం నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తాటిపాముల బాలకృష్ణ, జేసీఐ ఇందూర్ అధ్యక్షుడు జైపాల్ కాలె తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

