Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగులపై కేసులు పెట్టడం తగదు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 09, 2026 12:06 PM గుంటూరుGeneral
నిరుద్యోగులపై కేసులు పెట్టడం తగదు - Udayam
పోలీస్ ఉద్యోగాలను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని నిరసన తెలిపిన యువతపై కేసులు నమోదు చేయడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. బుధవారం గుంటూరులో మాట్లాడారు. రాష్ట్రంలో 15 వేలకు పైగా కానిస్టేబుల్ ఖాళీలు ఉండగా, జాబ్ క్యాలెండర్‌లో కేవలం 2,700 పోస్టులే చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలకు తగినట్లుగా పోస్టుల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...