Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగుల సమస్యలపై సీపీఎం ధర్నా

Follow Udayam on Google
sudheer Aug 20, 2026 12:08 PM కరీంనగర్General
నిరుద్యోగుల సమస్యలపై సీపీఎం ధర్నా - Udayam
ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు గుడికందుల సత్యం తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...