Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో పచ్చని అడవిపై పురుగుల దాడి

Follow Udayam on Google
Naresh Aug 16, 2026 4:03 PM నిర్మల్తెలంగాణ
వర్షాకాలంలో పచ్చగా ఉండాల్సిన చెట్లు ఎండాకాలాన్ని తలపిస్తూ బోసిపోతున్నాయి. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం బెల్గాం రోడ్డుకు ఇరువైపులా, అటవీ ప్రాంతంలో టేకు చెట్ల ఆకులు భారీగా రాలిపోతున్నాయి. పురుగుల ఉధృతి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనంతో నిండాల్సిన అడవి ఇలా ఎండిపోవడంపై సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి, నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...