వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీలంకలో తొమ్మిది మంది భారత జాలర్ల అరెస్ట్

సముద్ర సరిహద్దు దాటి జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలతో లంక నావికాదళం తొమ్మిది మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసి, వారి పడవను సీజ్ చేసింది. అరెస్టయిన వారిని తదుపరి చర్యల కోసం మన్నార్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్కు అప్పగించారు
పాక్ జలసంధిలో సరిహద్దు ఉల్లంఘనలపై ఇరుదేశాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు 128 మంది భారత జాలర్లను శ్రీలంక అధికారులు అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...