వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామంలోని పటేల్ చెరువు రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నిండుకుండలా మారి మత్తడి పోస్తోంది. వర్షాభావంతో బోరుబావుల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి.
చెరువులోకి భారీగా నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీటి లభ్యత పెరగడంతో పంటలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

