వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలకు గండిరామారం చెరువు నిండుకుండలా మారింది. రెండు మత్తడులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా వరదనీరు చేరడంతో చెరువు పూర్తిగా నిండిందని గ్రామస్థులు తెలిపారు.
మత్తడుల నుంచి ప్రవహించే నీరు మల్లన్నగండిలో కలుస్తుందని పేర్కొన్నారు. చెరువు నిండడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో జలకళ సంతరించుకుంది.
Comments
Loading comments...

