వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపల్లి మండలం నిడిగొండలోని కాకతీయుల కాలం నాటి త్రికూట ఆలయ పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రివేళ కొందరు మద్యం సేవిస్తున్నారని పేర్కొన్నారు.
ఇటీవల ఆలయ పరిసరాల్లో స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దినా, కొందరి కారణంగా మళ్లీ అపరిశుభ్రంగా మారుతున్నాయని తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

