వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువుల కొరత సృష్టించినా అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 3.65 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, 11,659 టన్నుల యూరియా, 3,707 టన్నుల డీఏపీ నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు.డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు.
Comments
Loading comments...

