వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లిలో నూతన తహసిల్దార్ భవనం ప్రారంభం

పెద్దపల్లి జిల్లా ఓదెలలో రూ.75 లక్షలతో నిర్మించిన నూతన తహసిల్దార్ భవనాన్ని ప్రభుత్వ విప్ విజయరామరావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు. 40 ఏళ్ల తర్వాత కార్యాలయం సొంత భవనంలోకి మారింది.
ఈ సందర్భంగా సూపర్ ఎల్నినో పరిస్థితుల రీత్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో భూ పునఃసర్వే చేపడుతున్నామని, దీనివల్ల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...