వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ‘రైతు బీమా’ స్థానంలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదన ప్రకారం రేషన్ కార్డు ఉన్న కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల పరిహారం అందనుంది.
అయితే భూమి ఉన్న ప్రతి రైతుకూ వర్తించే పాత విధానం కాకుండా, కొత్త పథకం కుటుంబంలో ఒక్కరికే పరిమితం కానుందనే చర్చ నడుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Loading comments...

