వార్తలకు తిరిగి వెళ్లండి

జనన, మరణాల నమోదుకు సంబంధించిన కొత్త సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. రెండేళ్లు దాటిన తర్వాత నమోదు చేసుకోవాలంటే జుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) అనుమతి తప్పనిసరి కానుంది.
ఒకటి నుంచి రెండేళ్లలోపు ఆలస్యమైతే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆదేశాలతో నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. దీంతో నమోదు ప్రక్రియ మరింత పటిష్టం కానుందని కేంద్రం తెలిపింది.
Comments
Loading comments...
