వార్తలకు తిరిగి వెళ్లండి

మలికిపురం మండలం లక్కవరంలో రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ లక్కవరం, బట్టేలంక, ఇరుసుమండ రైతులకు పాస్పుస్తకాలు పంపిణీ చేశారు.
రీ-సర్వేలో భాగంగా ప్రభుత్వం సరఫరా చేసిన పాస్పుస్తకాలను రైతులకు అందించారు. రీ-సర్వే ద్వారా భూ రికార్డులను పారదర్శకంగా రూపొందించి రైతులకు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

