వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో నెమ్మదిగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా చిరుజల్లులతో వాతావరణం చల్లబడింది. వర్షంతో గ్రామ పరిసర ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి.
చిరుజల్లులు కురుస్తుండటంతో ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారు.వర్షం ఇలాగే కొనసాగితే పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అయితే భారీ వర్షం కాకుండా నెమ్మదిగా కురుస్తుండటంతో సాధారణ జనజీవనానికి పెద్దగా అంతరాయం కలగలేదు.
Comments
Loading comments...

