Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. వాహనాల మళ్లింపు

Follow Udayam on Google
G,SATHISH Sep 12, 2026 8:55 AM హైదరాబాద్General
నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. వాహనాల మళ్లింపు - Udayam
ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనానికి భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో నేటి నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దర్శనానికి వచ్చే వాహనాలను పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. వాహనాల రద్దీ నియంత్రణకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టనున్నారు. ఈ ఆంక్షలు ఈ నెల 24 వరకు కొనసాగనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...