Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్ నమోదు

Follow Udayam Digital on Google
శివ కుమార్ Aug 05, 2026 9:08 AM ఆల్ ఇండియా జాతీయ
నేటి నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్ నమోదు - Udayam Digital
నీట్ యూజీ కౌన్సెలింగ్-2026 తొలి విడత ఆన్‌లైన్ నమోదు నేటి నుంచి ప్రారంభంకానుంది. ఎంసీసీ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12 మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదు, ఫీజు చెల్లింపులకు అవకాశం ఉంది. ఆగస్టు 6–13 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేయవచ్చు. 12–13 తేదీల్లో ఛాయిస్ లాకింగ్, 13–16 మధ్య సీట్ల కేటాయింపు, 17న ఫలితాలు వెలువడనున్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 18–22 మధ్య కళాశాలల్లో చేరాలి.

Comments

G
Loading comments...