వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 41 ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయం, ఎక్సైజ్, రూరల్ వాటర్ స్కీమ్, ఎంపీడీవో, హౌసింగ్, రెవెన్యూ శాఖలకు వినతులు వచ్చాయి.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. మండల ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

