Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జునసాగర్‌కు పెరుగుతున్న వరద

Follow Udayam on Google
T. SRINU BABU Aug 16, 2026 3:23 PM పల్నాడుఆంధ్రప్రదేశ్
నాగార్జునసాగర్‌కు పెరుగుతున్న వరద - Udayam
నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ప్రస్తుతం 525.60 అడుగులకు చేరగా, దీని పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పైనుంచి వచ్చే వరద ప్రవాహం తగ్గినా, అక్కడ జలవిద్యుత్ ఉత్పత్తి కోసం విడుదల చేస్తున్న నీరు సాగర్‌కు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఖరీఫ్ సాగు పనులు ప్రారంభించిన రైతాంగం నాగార్జునసాగర్ కాలువల ద్వారా సాగునీటి విడుదల కోసం నిరీక్షిస్తోంది.

Comments

G
Loading comments...