వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ఆత్మ ఆధ్వర్యంలో వరి సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతు సుద్దాల భూమ సాహెబ్ వరి పొలంలో డ్రోన్ ద్వారా నానో యూరియా, నానో డీఏపీ పిచికారీపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.
రైతులు ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరేష్, వ్యవసాయ అధికారులు, ఆత్మ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

