Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముష్టికుంట్ల–లింగాల రహదారికి రూ.2.50 కోట్ల నిధులు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 4:27 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ముష్టికుంట్ల–లింగాల రహదారికి రూ.2.50 కోట్ల నిధులు - Udayam
తిరువూరు మండలం ముష్టికుంట్ల నుంచి గంపలగూడెం మండలం లింగాల వరకు రహదారి నిర్మాణానికి రూ.2.50 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తెలిపారు. నిధుల మంజూరుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రహదారి నిర్మాణంతో రెండు మండలాల పరిధిలోని గ్రామాల మధ్య రాకపోకలు మెరుగుపడనున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...