వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు బుధవారం రాజంలోని క్యాంపు కార్యాలయంలో మునిసిపల్ అదికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో నెలకొన్న రోడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాలు, ఇతర ప్రజా సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
Comments
Loading comments...

