Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై IIT లో పట్టా సాధించిన రైతు కుమారుడు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 23, 2026 12:36 PM విజయనగరంGeneral
ముంబై IIT లో పట్టా సాధించిన రైతు కుమారుడు - Udayam
విజయనగరం జిల్లా వేపాడ మండలం కొండ గంగుబూడి గ్రామానికి చెందిన ప్రముఖ రైతు ఉద్యమ నాయకుడు చల్లా జగన్‌ పెద్దకుమారుడు చాణిక్య విహార్‌ ముంబై IITలో చదివి ఎంటెక్‌ పట్టా సాధించాడు. ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా 10/10 సాధించి రోబోటిక్‌ ఇంజినీరుగా ఉద్యోగం సాధించాడని జగన్‌ ఆదివారం తెలిపారు.ఈ సందర్భంగా గ్రామం నుంచి ముంబైలో ఉద్యోగం సాధించే స్థాయికి ఎదిగిన విహార్‌ను గ్రామస్థులు అభినందించారు.

Comments

G
Loading comments...