వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగొండ మండలం బాణాపురం తండాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. నాట్లు వేసే పనిలో ఉన్న వ్యవసాయ కూలీలు పొలంలోనే జాతీయ జెండాను ఆవిష్కరించి సగర్వంగా వందనం చేశారు.
కష్టపడి పనిచేసే చేతులతోనే దేశభక్తిని చాటుతూ జెండాకు సెల్యూట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శ్రమజీవుల దేశభక్తిని ప్రతిబింబించిన ఈ దృశ్యం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. కూలీల స్ఫూర్తిని పలువురు అభినందించారు.
Comments
Loading comments...

