వార్తలకు తిరిగి వెళ్లండి
ముధోల్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల భద్రతా చర్యలను పర్యవేక్షించారు.
ముధోల్ రామాలయంలో ప్రతిష్టించిన సార్వజనిక వినాయకుడికి ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు.
Comments
Loading comments...

