వార్తలకు తిరిగి వెళ్లండి

మరియా తండా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుగ్లోత్ జ్యోతి గణేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి గణేష్ మాట్లాడుతూ..దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి త్యాగఫలమే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

