వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాలలోని శివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున పూజా కార్యక్రమాల సమయంలో కోతులు స్టోర్రూంలోకి చొరబడి సామగ్రిని ధ్వంసం చేశాయి. పెద్ద సంఖ్యలో కోతులు సంచరిస్తుండటంతో భక్తులు, కాలనీవాసులు, చిన్నారులు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు.
మున్సిపాలిటీలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే కోతులను పట్టించాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

