వార్తలకు తిరిగి వెళ్లండి

వజ్రపుకొత్తూరు (M) నగరంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ సందర్భంగా ఎన్జీసీ, జూనియర్ రెడ్క్రాస్ క్లబ్ ఆధ్వర్యంలో వృక్ష రక్షాబంధన్ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలకు రాఖీలు కట్టి వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
“వృక్షో రక్షతి రక్షతః” నినాదంతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. H M టి. హేమారావు, ఎస్ఎంసీ చైర్మన్ బి. లక్ష్మిపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

