Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొగిలిగిద్ద మున్నూరు కాపు సంఘం స్థలంపై ఆక్రమణ ఆరోపణలు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 20, 2026 9:32 PM రాజన్న సిరిసిల్లGeneral
మొగిలిగిద్ద మున్నూరు కాపు సంఘం స్థలంపై ఆక్రమణ ఆరోపణలు - Udayam
షాద్‌నగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద గ్రామంలో మున్నూరు కాపు సంఘానికి చెందిన 322 చదరపు గజాల స్థలాన్ని కొందరు ఆక్రమించారని సంఘం అధ్యక్షుడు ఇ.మల్లేష్ ఆరోపించారు. ఈ మేరకు సంఘ సభ్యులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ ఆత్మగౌరవ భవన స్థలాన్ని తిరిగి ఇప్పించాలని కోరారు. స్పందించిన మల్లన్న జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడి విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...