వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్లో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో సింగతి లక్ష్మి (42)ను ఆమె మరిది అర్ధరాత్రి దారుణంగా నరికి హత్య చేసినట్లు సమాచారం. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
హత్యకు మంత్రాలపై అనుమానమే కారణమా, కుటుంబ కలహాలా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. మూఢనమ్మకాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.
Comments
Loading comments...

