వార్తలకు తిరిగి వెళ్లండి

మంథని ఎంత వర్షం కురిసినా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలన్న చిన్నారుల దేశభక్తి అందరినీ ఆకట్టుకుంది.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో శనివారం ఉదయం ముసురు వర్షం, బురద దారులను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు గొడుగులు పట్టుకుని పాఠశాలకు బయలుదేరారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ స్వాతంత్ర్య వేడుకల పట్ల వారు చూపిన ఉత్సాహాన్ని పలువురు అభినందించారు.
Comments
Loading comments...

